BALAYYA : సొంత చెల్లెళ్ల ఉసురుపోసుకుంటున్న సీఎం
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:00 PM
రాష్ట్రంలో ఉన్న మహిళలు తన అక్కా చెల్లెళ్లు అంటూ చెప్పుకునే ముఖ్య మంత్రి జగన్మోహనరెడ్డి తన సొంత చెల్లెళ్ల ఉసురు పోసుకుంటున్నారని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం హిందూపురం మండలంలోని బాలంపల్లి, చలివెందుల, మలగూరు, మణేస ముద్రం, కగ్గల్లు, బీరేపల్లి పంచాయతీల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లా డుతూ రూ. 1600 కోట్లు వృథాచేసి సిద్ధం పోస్టర్లు పెట్టించారన్నారు.
గులకరాయి వేయించుకునేందుకే సిద్ధం
ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ
హిందూపురం, ఏప్రిల్ 25: రాష్ట్రంలో ఉన్న మహిళలు తన అక్కా చెల్లెళ్లు అంటూ చెప్పుకునే ముఖ్య మంత్రి జగన్మోహనరెడ్డి తన సొంత చెల్లెళ్ల ఉసురు పోసుకుంటున్నారని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం హిందూపురం మండలంలోని బాలంపల్లి, చలివెందుల, మలగూరు, మణేస ముద్రం, కగ్గల్లు, బీరేపల్లి పంచాయతీల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లా డుతూ రూ. 1600 కోట్లు వృథాచేసి సిద్ధం పోస్టర్లు పెట్టించారన్నారు.
తాను సిద్దమని అంటున్నాడు. ఎం దుకు? గులకరాయి వేయిం చుకునేందుకు సిద్ధమా? రాష్ట్ర ప్రజలను ఇంకా మో సం చేయడానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. సీఎం జగన రాష్ట్ర భవిష్యత్తుని సర్వ నాశనం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడని విమర్శించారు. జ నం అంతా ఏకమై జగనను ఇంటికి పంపడానికి సిద్దంగా ఉన్నారన్నారు. ఓటుతో ఆయనకు పోటు పొడ వాల న్నారు. మన ఓటు రుచి చూపించాలన్నారు. జగన్మో హనరెడ్డి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నా రు. నియోజకవర్గ అభివృద్ది బాధ్యత తనదే అని, టీడీపీ అధికారంలోకి వస్తే హిందూపురాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. నాయకులు, కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఉమ్మడి పార్టీల సభలకు వస్తున్న జనాన్ని చూస్తే అధికారంలోకి రావడం ఖాయమైందన్నారు. ఈ సందర్భంగా మలు గూరు, చలివెందుల్లో కొంతమంది వైసీపీ నాయకులు పార్టీలో చేరారు. వారికి బాలకృష్ణ కండువాలు వేసి అహ్వానించారు. ప్రచారంలో భాగంగా ఆయన బాలంపల్లిలోని ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. చలివెందులలో మాజీ సర్పంచ చిన్నారెడ్డి ఇంటికి వెళ్లి గ్రామస్థులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలెల్లో జనం నీరాజనం పలికారు. .ఈ కార్యక్రమంలో కన్వీనర్ అశ్వత్థ నారాయణరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బేవనహళ్లి ఆనంద్, అంజినరెడ్డి, చిన్నారెడ్డి, మంగేష్్, మంజునాథ్, విష్ణు, నాగభూషణ, బాబురెడ్డి, రామకృష్ణ, శంకర్ తదితరలు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....