సరిహద్దుల్లో మూతపడిన చెక్పోస్టులు
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:06 PM
వైసీపీ పాలనలో సరిహద్దుల్లో మద్యం అక్రమ రవాణాకు గేట్లు ఎత్తేశారనే విమర్శలు వినవస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లో మద్యం, ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో తనిఖీలు చేయడంకోసం చెక్పోస్టులు ఏర్పాటు చేశారు.
మడకశిర రూరల్ ఏప్రిల్ 25: వైసీపీ పాలనలో సరిహద్దుల్లో మద్యం అక్రమ రవాణాకు గేట్లు ఎత్తేశారనే విమర్శలు వినవస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లో మద్యం, ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో తనిఖీలు చేయడంకోసం చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మండలంలోని సరిహద్దు గ్రామాల్లో ఏడు చెక్పోస్టులు ఏర్పాటు చేసి, వాటికి విద్యుత సౌకర్యం కల్పించారు. సీసీ కెమేరాలు కూడా ఏర్పాటు చేశారు. నిధుల కొరతతో ఏడాది తిరగకమునుపే చెక్పోస్టులు ఎత్తివేశారు. దీంతో లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యింది. ప్రస్తుతం ఎన్నిల సమయం కావడంతో కర్ణాటక నుంచి వివిధ మార్గాల్లో మద్యం అక్రమంగా ఆంధ్రలోకి జోరుగా రవాణా అవుతోంది. దీంతో గ్రామాల్లో కర్ణాటక మద్యం ఏరులై పారుతోంది.