TDP : పావగడలో టీడీపీ, జనసేన అభిమానుల సంబరాలు
ABN , Publish Date - Jun 04 , 2024 | 11:56 PM
ఆంధ్రప్రదేశ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీ డీపీ జనసేన కూటమి గెలుపుపట్ల పావగడ తాలూకా వ్యాప్తంగా టీడీపీ, పవనకల్యాణ్ అభిమానులు మంగళవారం పెద్దఎత్తున సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబు, పవనకళ్యాణ్ కలిసి చేసిన యుద్ధంలో జయభేరి మోగించి సంచలనం సృష్టించిందన్నారు. బై...బై... జగన, హాయ్ హాయ్ పవన అంటూ ర్యాలీ నిర్వహించారు.
![TDP : పావగడలో టీడీపీ, జనసేన అభిమానుల సంబరాలు](https://media.andhrajyothy.com/media/2024/20240604/4pavagada1_f00293ba3b.jpg)
పావగడ, జూన 4 : ఆంధ్రప్రదేశ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీ డీపీ జనసేన కూటమి గెలుపుపట్ల పావగడ తాలూకా వ్యాప్తంగా టీడీపీ, పవనకల్యాణ్ అభిమానులు మంగళవారం పెద్దఎత్తున సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబు, పవనకళ్యాణ్ కలిసి చేసిన యుద్ధంలో జయభేరి మోగించి సంచలనం సృష్టించిందన్నారు. బై...బై... జగన, హాయ్ హాయ్ పవన అంటూ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నాయుడును ఎన్ని అడ్డంకులు చేసినా ధర్మం అనేది ఆయన్ను గెలిపించిందన్నారు. వైసీపీ ఫ్యాన గుర్తును బైక్లకు కట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటన పావగడలో ఉద్రిక్తత నెలకొనడంతో సీఐ సురేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మందలించారు. పవనకళ్యాణ్ అభిమానులు శాంతించి పోలీసులకు సహకరించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....