Share News

TDP : కూటమి విజయంపై సంబరాలు

ABN , Publish Date - Jun 04 , 2024 | 11:45 PM

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం వెలువడిన ఫలితాల్లో టీ డీపీ కూటమి ప్రభంజనం సృష్టించడంతో ప్రజలు ఆనందడోలికల్లో మునిగిపోయారు. ఫలితాలపై ఇరవై రోజులకుపైగా ప్రజలు ఎదురు చూశారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో మంగళవా రం ఉదయం నుంచి టీవీలకు అతుక్కుపోయా రు. రౌండు రౌండుకూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆ ధిక్యం పెరుగుతుండ డంతో ఉత్సాహం రెట్టింపుపై ఉర్రూతలూగారు. ఎవరికి తోచిన విధంగా వారు ఓళిగలు, మాంసాహారం తదితర పదార్థాలు వం డుకుని పండుగ చేసుకున్నారు. ర్యాలీలు నిర్వహిం చారు.

TDP : కూటమి విజయంపై సంబరాలు
Fans dancing at Balayya's house in Puram

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌)

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం వెలువడిన ఫలితాల్లో టీ డీపీ కూటమి ప్రభంజనం సృష్టించడంతో ప్రజలు ఆనందడోలికల్లో మునిగిపోయారు. ఫలితాలపై ఇరవై రోజులకుపైగా ప్రజలు ఎదురు చూశారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో మంగళవా రం ఉదయం నుంచి టీవీలకు అతుక్కుపోయా రు. రౌండు రౌండుకూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆ ధిక్యం పెరుగుతుండ డంతో ఉత్సాహం రెట్టింపుపై ఉర్రూతలూగారు. ఎవరికి తోచిన విధంగా వారు ఓళిగలు, మాంసాహారం తదితర పదార్థాలు వం డుకుని పండుగ చేసుకున్నారు. ర్యాలీలు నిర్వహిం చారు. హిందూపురంలో బాలయ్యకు ఆధిక్యత రావడంతో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నంద మూరి బాలకృష్ణ ఇంటి వద్దకు వచ్చి టపాసులు కాల్చా రు. డప్పుల మోతలతో నృత్యాలు చేశారు. బాలయ్యకు అభి నం దనలు తెలిపారు. ఆయన ఇంటి వద్దకు వచ్చిన అభిమాను లకు అభివాదం చేసి ఆనందం వ్యక్తం చేశారు. టీ డీపీ మైనార్టీ నాయకుడు, పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్య క్షుడు ఎండీఎస్‌ హిదాయత, ఆర్‌ఎంఎస్‌ షఫీ తదితరులు బాలయ్యకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.


జనసేన నాయకులు ఆకుల ఉమేష్‌, శేఖర్‌ తదితరులు బాల య్యకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హిందూ పురం పట్టణంతో పాటు రూరల్‌ మండలం లేపాక్షి, పరిగి మండలాల వ్యాప్తం గా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకు న్నారు. అలాగే కూటమి ఎన్నికల్లో ఘన విజయం సాధించ డంతో ఎమ్మెల్యే అభ్యర్థి సవిత, హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారఽథి అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో పాటు గోరంట్లలో సంబరా లు చేసుకున్నారు. ఆ సమయం లో అక్కడికి వచ్చిన మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు పూల మాలలు వేసి, ఆయనను భుజాలపైకి ఎత్తుకుని కేరింతలు కొడుతూ సంబరపడ్డారు. అలాగే పెనుకొండ పట్టణంతో పాటు పెనుకొండ, లేపాక్షి, సోమందేపల్లి, రొద్దం మండలాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాల్లో మునిగితేలారు. మడకశిరలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించ డంతో మడకశిర పట్టణం, మండలంతో పాటు రొళ్ల, గుడిబం డ, అగళి, అమరాపురం మండలాల్లో టీడీపీ నాయకులు, కార్య కర్తలు, అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. పలు చోట్ల ఫ్యానను ద్విచక్రహ నానికి కట్టి రోడ్లపై ఈడ్చుకుంటూ వెళ్లారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 04 , 2024 | 11:45 PM