జాగరణ మహోత్సవాన్ని జయప్రదం చేయండి
ABN , Publish Date - Feb 27 , 2024 | 11:52 PM
మహాశివరాత్రిని పురస్కరించుకుని మార్చి 8న స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాగరణ మహోత్సవంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని పరిషత సభ్యుడు శ్రీపాద వేణు పిలుపునిచ్చారు.
![జాగరణ మహోత్సవాన్ని జయప్రదం చేయండి](https://media.andhrajyothy.com/media/2024/20240227/_ed468bbdfb.jpg)
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 27: మహాశివరాత్రిని పురస్కరించుకుని మార్చి 8న స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాగరణ మహోత్సవంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని పరిషత సభ్యుడు శ్రీపాద వేణు పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం టీటీడీ కల్యాణమండపంలో జాగరణ మహోత్సవ బ్రోచర్లను ఆవిష్కరించారు. 8న సాయంత్రం 5 నుంచి 9వ తేదీ తెల్లవారుజాము 5 గంటల వరకు జాగరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాగరణ మహోత్స వంలో పాలొనే భక్తుల కు ఆధ్యా త్మిక ప్రశ్నల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అంది స్తామన్నారు. అదేవిధంగా శివ లింగానికి అభిషేకాలు నిర్వహిం చడంతో పాటు అభి షేకంలో పాల్గొన్న భక్తులకు పంచముఖ రుద్రాక్షలు, వార ణాసి నుం చి తీసుకువచ్చిన కాలభైరవ కంకణాలు అందజే స్తామ న్నారు. అదే కార్యక్రమంలో లాటరీ పద్ధతిలో ఎంపి కైనవారికి శ్రీశైల క్షేత్ర దర్శనం ఉచితంగా కల్పిస్తామన్నారు. ఈ మహోత్సవంలో పాల్గొనదలచినవారు మార్చి 6 లోపు 94923 25020, 80193 81267 నెంబర్లను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పరిషత సభ్యు లు నాగేశ్వరి, సాయిరాం, మధు, వెంకటాద్రి, టీటీడీ ప్రోగ్రా మ్ అసిస్టెంట్ బాబు, పండిట్ వేణు పాల్గొన్నారు.