Share News

POLICE : పోలీసులకు పశువుల వాహనం..!

ABN , Publish Date - May 15 , 2024 | 12:31 AM

జరిగిన ఆంధ్రప్రదేశ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు కోసం సోమవారం కర్ణాటక నుంచి బందోబస్తు కోసం వెళ్లిన పోలీ సులకు సరైన సౌకర్యాలు కల్పించలేదని, అవమానకరమైన రీతిలో వ్యవహ రించారని కొందరు పోలీసులు అసహనం వ్యక్తం చేశారు. బెంగళూరు నుంచి ఆంధ్ర ప్రదేశలోని కర్నూల్‌ జిల్లాకు బందోబస్తు కోసం వెళ్లేందుకు పోలీసు సిబ్బందిని పశువులను తరలించే ట్రక్కులో ఆ ప్రాంతంలోని రూట్‌ మ్యాప్‌కు పంపారని అక్కడకు వెళ్లిన పోలీసులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

POLICE : పోలీసులకు పశువుల వాహనం..!
Karnataka police going in a cattle truck

పావగడ, మే 14: జరిగిన ఆంధ్రప్రదేశ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు కోసం సోమవారం కర్ణాటక నుంచి బందోబస్తు కోసం వెళ్లిన పోలీ సులకు సరైన సౌకర్యాలు కల్పించలేదని, అవమానకరమైన రీతిలో వ్యవహ రించారని కొందరు పోలీసులు అసహనం వ్యక్తం చేశారు. బెంగళూరు నుంచి ఆంధ్ర ప్రదేశలోని కర్నూల్‌ జిల్లాకు బందోబస్తు కోసం వెళ్లేందుకు పోలీసు సిబ్బందిని పశువులను తరలించే ట్రక్కులో ఆ ప్రాంతంలోని రూట్‌ మ్యాప్‌కు పంపారని అక్కడకు వెళ్లిన పోలీసులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాత్రి పగలు తమ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా విధి నిర్వహణలో ఎంతటి త్యాగానికైనా సిద్ధమయ్యే పోలీసు వ్యవస్థపై ఇలా చిన్నచూపు చూడటం దారుణమైన విషయమన్నా రు. తాము కర్తవ్యంలో ఉన్నందున విధి లేని పరిస్థితుల్లో ట్రక్కులో వెళ్లాల్సి వచ్చిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 15 , 2024 | 12:31 AM