Share News

కారు బోల్తా.. భార్య మృతి

ABN , Publish Date - Apr 21 , 2024 | 02:47 AM

కదిరిఅర్బన, ఏప్రిల్‌ 20: మండలంలోని కౌవులేపల్లి వద్ద శు క్రవారం అర్ధరాత్రి సమయంలో కా రు బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కది రి పట్టణానికి చెందిన దివాకర్‌, ఉమామహేశ్వరి దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నా రు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు సందీప్‌ బీటెక్‌ చదువుతుండగా, రెండో కుమారుడు జయదీప్‌ ఇటీవల పది పరీక్షలు రాశాడు.

కారు బోల్తా.. భార్య మృతి
Umamaheswari (File)

కదిరిఅర్బన, ఏప్రిల్‌ 20: మండలంలోని కౌవులేపల్లి వద్ద శు క్రవారం అర్ధరాత్రి సమయంలో కా రు బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కది రి పట్టణానికి చెందిన దివాకర్‌, ఉమామహేశ్వరి దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నా రు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు సందీప్‌ బీటెక్‌ చదువుతుండగా, రెండో కుమారుడు జయదీప్‌ ఇటీవల పది పరీక్షలు రాశాడు. కాగా చిన్నకుమారుడికి ఇంటర్‌ ప్రవేశాలకోసం భార్యభర్త తిరుపతికి శుక్రవారం ఉదయం కారులో వెళ్లారు. పని అనంతరం వెంటనే తిరిగి వస్తుండగా పదినిమిషాలకు గమ్యస్థానానికి చేరుకునే సమయంలో కౌలేపల్లి వద్ద కారు ముందరి టైర్‌ పగలి బోల్తాపడింది. ప్రమాదంలో ఉమామహేశ్వరి(45) అక్కడికక్కడే మృతిచెందగా, దివాకర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రుడిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు కదిరి రూరల్‌ పరిధిలోని గంగన్నగారిపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు.


కాగా చిన్నకుమారుడికి ఇంటర్‌ ప్రవేశాలకోసం భార్యభర్త తిరుపతికి శుక్రవారం ఉదయం కారులో వెళ్లారు. పని అనంతరం వెంటనే తిరిగి వస్తుండగా పదినిమిషాలకు గమ్యస్థానానికి చేరుకునే సమయంలో కౌలేపల్లి వద్ద కారు ముందరి టైర్‌ పగలి బోల్తాపడింది. ప్రమాదంలో ఉమామహేశ్వరి(45) అక్కడికక్కడే మృతిచెందగా, దివాకర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రుడిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు కదిరి రూరల్‌ పరిధిలోని గంగన్నగారిపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Updated Date - Apr 21 , 2024 | 02:47 AM