ycp: వైసీపీకి మద్దతుగా వలంటీర్ల ప్రచారం
ABN , Publish Date - Apr 25 , 2024 | 01:04 AM
ధర్మవరంరూరల్, ఏప్రిల్24: మండలంలోని దర్శినమల గ్రామంలో వలంటీర్లు రామ్మోహన, చంద్రశేఖర్, అ క్కులప్ప, పోతలయ్యలు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కి ఓటు వేయాలని స్థానిక నాయకులతో కలిసి ఓటర్లను అభ్యర్థించారు. అదేవిధంగా బుధవారం ఎమ్మెల్యే నామినేషనకు రావాలని ఇంటింటీకి వెళ్లి ఆహ్వానించారు.
ధర్మవరంరూరల్, ఏప్రిల్24: మండలంలోని దర్శినమల గ్రామంలో వలంటీర్లు రామ్మోహన, చంద్రశేఖర్, అ క్కులప్ప, పోతలయ్యలు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కి ఓటు వేయాలని స్థానిక నాయకులతో కలిసి ఓటర్లను అభ్యర్థించారు. అదేవిధంగా బుధవారం ఎమ్మెల్యే నామినేషనకు రావాలని ఇంటింటీకి వెళ్లి ఆహ్వానించారు.
నడిమిగడ్డపల్లికి చెందిన వలంటీర్ బొజ్జేనాయక్ ఎమ్మెల్యే నామినేషన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఫీల్డ్అసిస్టెం ట్లు, వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీచేసినప్పటీకి ఇంకా కొంతమంది ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటూ తమ స్వామి భక్తి ని చాటుకుంటున్నారు. ఆ వలంటీర్లుపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మండలకన్వీనర్ పోతుకుంటలక్ష్మన్న, నాయకు లు జంగం నరసింహులు, ధనుంజయ, చెన్నప్ప, పవన, రమణలు కలిసి ఎంపీడీఓ కార్యాలయపు అధికారికి ఆధారాలతో వినతిపత్రం అందించారు. ఈసీ ఆదేశాలను ఉల్లంఘించిన వలంటీర్లుపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
మరిన్ని వార్తల కోసం...