నారా లోకేశకు బీవీ థాంక్స్
ABN , Publish Date - Apr 27 , 2024 | 12:52 AM
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్గా నియమితులైన బీవీ వెంకటరాముడు ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశను శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు.
అనంతపురం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్గా నియమితులైన బీవీ వెంకటరాముడు ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశను శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. టీడీపీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్గా తనను నియమించినందుకు ఆయన లోకేశకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం అర్బన నియోజకవర్గానికి చెందిన బీవీ వెంకటరాముడు రెండున్నర దశాబ్దాలుగా పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. జిల్లా ప్రచార కార్యదర్శిగా, యువగళం మీడియా కో-ఆర్డినేటర్ గా ఆయన పార్టీకి సేవలందించారు. ఈ సందర్భంగా బీవీ వెంకటరాముడు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఒక సామాన్య కార్యకర్తగా పార్టీకి పని చేస్తున్న తనను గుర్తించి పార్టీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్గా నియమించినందుకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో... మీడియాను సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు.