Share News

నారా లోకేశకు బీవీ థాంక్స్‌

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:52 AM

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్‌గా నియమితులైన బీవీ వెంకటరాముడు ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశను శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు.

నారా లోకేశకు బీవీ థాంక్స్‌
bv venkatramudu with lokesh

అనంతపురం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్‌గా నియమితులైన బీవీ వెంకటరాముడు ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశను శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. టీడీపీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్‌గా తనను నియమించినందుకు ఆయన లోకేశకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం అర్బన నియోజకవర్గానికి చెందిన బీవీ వెంకటరాముడు రెండున్నర దశాబ్దాలుగా పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. జిల్లా ప్రచార కార్యదర్శిగా, యువగళం మీడియా కో-ఆర్డినేటర్‌ గా ఆయన పార్టీకి సేవలందించారు. ఈ సందర్భంగా బీవీ వెంకటరాముడు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఒక సామాన్య కార్యకర్తగా పార్టీకి పని చేస్తున్న తనను గుర్తించి పార్టీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్‌గా నియమించినందుకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో... మీడియాను సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:52 AM