ఇంట్లో చోరీ
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:08 AM
పట్టణంలోని వి నాయక్ నగర్లో నివశిస్తున్న చాకలి శ్రీనివాసులు ఇంట్లో మంగళవారం తెల్లవా రుజామున చోరీ జరిగింది. బీరువా లోని ఐదుతులాల బంగారం, రూ.1.50 లక్షల నగదు ఎత్తుకె ళ్లినట్లు బాధితులు తెలిపారు.

ఐదు తులాల బంగారం... రూ.1.50 లక్షలు నగదు అపహరణ
గోరంట్ల, మార్చి 5: పట్టణంలోని వి నాయక్ నగర్లో నివశిస్తున్న చాకలి శ్రీనివాసులు ఇంట్లో మంగళవారం తెల్లవా రుజామున చోరీ జరిగింది. బీరువా లోని ఐదుతులాల బంగారం, రూ.1.50 లక్షల నగదు ఎత్తుకె ళ్లినట్లు బాధితులు తెలిపారు. శ్రీనివా సులు శివమాల ధ రించాడు. దీంతో తెల్లవారుజామున 3.45గంటలకు గోరంట్లలోని సోమేశ్వర ఆలయంలో ఇరుముడి ఉండడంతో ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులంతా వెళ్లారు. అనంతరం ఉదయం 4.30గంటలకు భార్య శైలజ ఇంటికి వచ్చింది. అయితే ఇంటి తాళం బద్దలుకొట్టి, చోరీ చేసినట్లు గుర్తించినట్లు తె లిపారు. స్ర్కూడ్రైవర్తో బీరువా తెరచి అందులోని తాళిబొట్టు చైన, నక్లీసు, రెండు జతల కమ్మలు, మూడు ఉంగారాలు కలిపి మొత్తం ఐదు తులాల బంగారంతో పాటు రూ.1.50లక్షలు నగద ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. కు మారుడు చంద్రశేఖర్ కుప్పంలోని పీఈఎస్ కళాశాలలో ఫిజియోథెరపీ చదువుతున్నాడని, ఫీజు కట్టడానికి నగదు పోగు చేసి ఉంచినట్లు చెప్పారు. ముందురోజు డ్వాక్రా డబ్బులు రూ.50వేలురాగా బీరువాలో భద్రపరిచామని, ఈవిషయం తెలిసినవారే చోరీకి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీస్ స్టేషనలో ఫిర్యాదు చేసినట్లు బాఽధితులు తెలిపారు.