Share News

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:12 AM

కొత్తచెరువు, మార్చి 25: వచ్చే ఎన్నికల్లో తన ను ఆశీర్వదించి గెలిపించాలని, నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి ప్రజల్ని అభ్యర్థించారు.

  ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా

-ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి అభ్యర్థన - గ్రామగ్రామాన ఘన స్వాగతం

కొత్తచెరువు, మార్చి 25: వచ్చే ఎన్నికల్లో తన ను ఆశీర్వదించి గెలిపించాలని, నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి ప్రజల్ని అభ్యర్థించారు. మండలంలోని కేశాపురం, కొడపగానిపల్లి పంచాయతీల్లో సోమవారం ఆమె ఎన్నికల ప్రచారాన్ని భర్త పల్లె వెంకట కృష్ణ కిశోర్‌రెడ్డితో కలిసి నిర్వహించారు. ఆయా గ్రామాలకు చేరుకోగానే స్థానిక టీడీపీ నాయకులతో పాటు గ్రామస్థులు పూల వర్షం కురిపిస్తూ.. హారతులు పడుతూ ఘన స్వా గతం పలికారు. ఆమె ఇంటింటికీ తిరిగి ప్రచారం చేపట్టారు. సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి ప్రజలకు కరపత్రాలు పంచుతూ వివరించారు. ము ఖ్యంగా మహిళలకు ప్రతినెలా రూ.1500, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, కుటుంబానికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, చదువుకునే పిల్లలకు ఏడాదికి రూ. 15 వేలు, రైతులకు పెట్టుబడి సాయం తదితర పథకాలను అందజేయనున్నట్లు తెలిపారు. చంద్రబాబు సీఎం కాగానే ఆ పథకాలన్నీ అమలవుతాయన్నారు. అలాగే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు కియ కార్ల పరిశ్రమను తీసుకొచ్చి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత చంద్రబాబుదే అని గుర్తు చేశా రు. గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. మళ్లీ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబు సీఎం కావాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని నియో జకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని సింధూర పేర్కొన్నారు. కార్యక్రమం లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 12:12 AM