Share News

BJP RALLY: బీజేపీ నాయకుల బైక్‌ ర్యాలీ

ABN , Publish Date - Jun 09 , 2024 | 10:55 PM

కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించినట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింక వసుంధరదేవి అన్నారు.

BJP RALLY: బీజేపీ నాయకుల బైక్‌ ర్యాలీ
BJP leaders conducting bike rally in Rayadurg

రాయదుర్గంరూరల్‌, జూన 9: కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించినట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింక వసుంధరదేవి అన్నారు. ఆదివారం పట్టణంలోని వినాయక సర్కిల్‌, పాత బస్టాండ్‌, లక్ష్మీబజార్‌ మీదుగా బైక్‌ ర్యాలీ సాగింది. అనంతరం టపాసులు కాల్చి స్వీట్లు పంచారు. కార్యక్రమంలో హీరోజీరావు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


గుంతకల్లుటౌన: భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కేశవ ఆధ్వర్యంలో ఆదివారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్‌, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు హాజరయ్యారు. ర్యాలీ బళ్లారి సర్కిల్‌లోని ఆభయాంజనేయస్వామి విగ్రహం నుంచి బీరప్ప సర్కిల్‌, మొయినరోడ్డు, మార్కెట్‌రోడ్డు మీదుగా కసాపురం రోడ్డులోని ఆంజనేయస్వామి దేవాలయం వరకు సాగింది. బీజేపీ నాయకులు హరిహరనాథ్‌, కొలమిశేకన్న, కొలమి రామాంజనేయులు, విశ్వనాథ్‌, కసాపురం రవి, పురంధర్‌, మంజులా వెంకటేష్‌, బండిమురళి, వడ్డె రమేష్‌, టీడీపీ నాయకులు హనమంతు, వీ రాముడు, జనసేన వాసగిరి మణికంఠ పాల్గొన్నారు.


బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు: పట్టణంలోని అంకాలమ్మ దేవాలయం వద్ద ఆదివారం భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు వడ్డె రమేష్‌ మాట్లాడుతూ.. దేశంలో ప్రజలందరూ అభివృద్ధి చెందాలంటే మరోసారి నరేంద్రమోదీ నాయకత్వం కావాలని ప్రజలు కోరకున్నారన్నారు. వెంకటేశ్వర్లు, కొలమి రామాంజనేయులు, విశ్వనాథ్‌, హరిహరనాథ్‌, పురంధర్‌, కొలమిశేకన్న, శ్రీదేవి, పద్మ పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2024 | 10:55 PM