Share News

ex minister palle: ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:21 AM

ఓట్ల లెక్కింపు సందర్భం గా కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలంటూ మాజీమంత్రి పల్లెరఘనాథరెడ్డి సూచించారు. హిందూపురంలోని సప్తగిరి కళాశాలలో సోమవారం ఆ యన కౌంటింగ్‌లో పాల్గొ నే ఏజెంట్లకు పలు సూ చనలు చేశారు.

 ex minister palle: ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి
కౌంటింగ్‌ ఏజెంట్లతో మాట్లాడుతున్న మాజీ మంత్రి పల్లె

పుట్టపర్తి జూన 3: ఓట్ల లెక్కింపు సందర్భం గా కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలంటూ మాజీమంత్రి పల్లెరఘనాథరెడ్డి సూచించారు. హిందూపురంలోని సప్తగిరి కళాశాలలో సోమవారం ఆ యన కౌంటింగ్‌లో పాల్గొ నే ఏజెంట్లకు పలు సూ చనలు చేశారు.


ఏజెంట్లు గుర్తింపు కార్డుతో పాటు ఎన్నికల అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాలను వెంట తీసుకుని మంగళవారం ఉదయం 5:30 గంటలకే కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపులో ఈవీఎంలలో సమస్యలు వచ్చిన వెంటనే రిటర్నింగ్‌ అధికారి, ఎన్నికల పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉండకూడదని సూచించారు. కౌంటింగ్‌లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, అనవసరమైన ఆవేశాలకు, గొడవలకు అవకాశం ఇవ్వవద్దని, పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలని పల్లె ఏజెంట్లకు సూచనలు చేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jun 04 , 2024 | 12:21 AM