నేడు బండారు శ్రావణిశ్రీ నామినేషన
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:22 AM
తాను నామినేషనను గురువారం వేస్తున్నట్లు కూటమి శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ తెలిపారు.
బుక్కరాయసముద్రం, ఏప్రిల్ 24: తాను నామినేషనను గురువారం వేస్తున్నట్లు కూటమి శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ తెలిపారు. కావున ఆరు మండలాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తల, అభిమానులు పెద్దసంఖ్యలో ఉదయం 10 గంటలకు శింగనమల మరవకొమ్మ వద్దకు రావాలని పిలుపునిచ్చారు.
పెనకచెర్ల డ్యాంలో ప్రచారం
గార్లదిన్నె : శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటి మడుగు కేశవరెడ్డి బుధవారం సాయంత్రం పెనకచెర్ల డ్యాం గ్రామంలో స్థాని క నాయకులతో కలిసి.. ప్రచారం నిర్వహించారు. గురువారం బండారు శ్రావణి శ్రీ నామినేషన వేస్తున్నారని, ఈ కార్యక్రమానికి శింగనమల నియోజ కవర్గం నుంచి టీడీపీ, జనసేనా, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు. కాగా, పెనకచెర్ల డ్యాం గ్రామంలోని 10 వైసీపీ కుటుంబాలు ఆయన ఆధ్వర్యంలో టీడీపీలో చేరాయి.
మరిన్ని వార్తల కోసం...