Share News

అరటి తోటకు నిప్పు

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:07 AM

తన అరటి తోటకు నిప్పంటుకుని రూ.3 లక్షలు పంట నష్టం వాటిల్లినట్టు మం డలం లోని బుళ్ళసముద్రం గ్రా మానికి చెందిన రంగ నాఽథ్‌ అనే రైతు తెలిపారు.

అరటి తోటకు నిప్పు
అరటి తోటలో మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

మడకశిర రూరల్‌, ఏప్రిల్‌ 2 : తన అరటి తోటకు నిప్పంటుకుని రూ.3 లక్షలు పంట నష్టం వాటిల్లినట్టు మం డలం లోని బుళ్ళసముద్రం గ్రా మానికి చెందిన రంగ నాఽథ్‌ అనే రైతు తెలిపారు. అరటి తోటకు నిప్పు అంటూకుని మంటలు ఎగసిపడుతుండడంతో చుట్టుపక్కల రైతులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక అధికారి విజయకుమార్‌ వెంటనే అగ్నిమాపక యంత్రం, సిబ్బందితో వెళ్లి మంటలు ఆర్పినట్లు తెలిపారు. విజయకుమార్‌ మాట్లడుతూ రైతు రంగనాథ్‌ మూడు ఎకరాల్లో అరటి తోట సాగుచేశారన్నారు. దానికి డ్రిప్‌ సౌకర్యం కల్పించారు. అకతాయిలు ఎవరో మధ్యాహ్నం సమయంలో తోటకు నిప్పుపెట్టినట్లు తెలిపారు. వెంటనే తమకు సమాచారం రావడంతో వచ్చి మంటలను అదుపుచేసినట్లు తెలిపారు. రైతుకు రూ 3లక్షల వరకు పంట నష్టపోయినట్లు తెలిపారు.

Updated Date - Apr 03 , 2024 | 12:08 AM