Share News

పురానికి చేరుకున్న బాలకృష్ణ

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:12 AM

టీడీపీ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన దాఖలు చేయడానికి స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం సాయంత్రం పురానికి చేరుకున్నారు.

పురానికి చేరుకున్న బాలకృష్ణ
బాలకృష్ణను సత్కరిస్తున్న కొల్లకుంట అంజినప్ప కుటుంబ సభ్యులు

నేడు మధ్యాహ్నం 12.10కి... బాలయ్య దంపతుల నామినేషన

సాయంత్రం భారీ ర్యాలీ

హిందూపురం, ఏప్రిల్‌ 18 : టీడీపీ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన దాఖలు చేయడానికి స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం సాయంత్రం పురానికి చేరుకున్నారు. మూ డోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన నామినేషన పత్రాలను శుక్రవారం మధ్యాహ్నం 12.10కు ఆయన ఆర్‌ఓకు అందజేయనున్నారు. అయితే ఈ సారి బాలకృష్ణతో పాటు ఆయన సతీమణి నందమూరి వసుంధరాదేవి కూడా డమ్మి అభ్యర్థిగా నామినేషన ప త్రాలు ఇదే సమయానికి అందజేయను న్నారు. బాలయ్య దంపతులు శుక్రవారం సానిక సూగూరు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి పూజ లు నిర్వహిస్తారు. అనంతరం కొద్దిమందితో ఎన్నికల రిట ర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకు ని నామినేషన పత్రాలు అందజే యను న్నారు. అనంతరం సాయంత్రం సూ గూరు ఆలయం నుంచి వేలాది మందితో ర్యాలీ నిర్వ హించనున్నట్లు టీడీపీ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

బాలయ్యను సత్కరించిన జిల్లా అధ్యక్షుడు

టీడీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షు డు కొల్లకుంట అంజినప్ప ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను సత్క రిం చారు. పురానికి చేరుకున్న బాలకృష్ణను కొల్ల కుంట అంజినప్ప కుటుంబ సభ్యులు కలిసి సత్కరించారు. జిల్లా అధ్యక్షుడిగా తనను నియమించేందుకు సహకరిం చిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధితో పాటు బాలయ్య గెలుపులో వడ్డెర్లు కీలకంగా పనిచే స్తారని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. బాలకృష్ణ మాట్లా డుతూ పార్టీచేసిన సేవను గుర్తించి జిల్లా అధ్యక్ష పదవి వచ్చిందన్నారు. పార్టీ అభివృద్ధికి కృషిచేస్తూ జిల్లాలో అందరినీ కలుపుకుని పనిచేయాలన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:12 AM