GUNDUMALA: అభివృద్ధి కావాలంటే బాబు రావాలి: గుండుమల
ABN , Publish Date - Apr 27 , 2024 | 12:54 AM
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కాలాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుు గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మండలంలోని చందకచర్ల, గౌడనహళ్ళి, ఆర్ అనంతపురం, ఛత్రం, బుళ్ళసముద్రం, కల్లుమర్రి, సీ కోడిగేపల్లి, మణూరు పంచాయతీ కేంద్రాల్లో ఎన్నిల ప్రచారం నిర్వహించారు. మొదట నియోజకవర్గానికి ఈశాన్యంలో ఉన్న చందకచర్ల ఆంజనేయస్వామి ఆలయంలో గుండుమల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజుతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![GUNDUMALA: అభివృద్ధి కావాలంటే బాబు రావాలి: గుండుమల](https://media.andhrajyothy.com/media/2024/20240413/26mdk_rural_2_29aee1f93b.jpg)
మడకశిర రూరల్, ఏప్రిల్ 26: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కాలాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుు గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మండలంలోని చందకచర్ల, గౌడనహళ్ళి, ఆర్ అనంతపురం, ఛత్రం, బుళ్ళసముద్రం, కల్లుమర్రి, సీ కోడిగేపల్లి, మణూరు పంచాయతీ కేంద్రాల్లో ఎన్నిల ప్రచారం నిర్వహించారు.
మొదట నియోజకవర్గానికి ఈశాన్యంలో ఉన్న చందకచర్ల ఆంజనేయస్వామి ఆలయంలో గుండుమల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజుతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అదే గ్రామం నుంచి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గుండుమల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఓటువేసి, టీడీపీ మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజును, ఎంపీ అభ్యర్థి పార్థసారథిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అనంతర టీడీపీ సూపర్ సిక్స్ పథకాల గురించి ఓటర్లుకు వివరించారు. ఎంఎస్ రాజు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీగెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయా పంచాయతీలలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....