Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

దేశానికి దిక్సూచి ఆర్యవైశ్యులు

ABN , Publish Date - Mar 03 , 2024 | 12:11 AM

దేశానికి దశ, దిశ, దిక్సూచి ఆర్యవైఽశ్యులే అని ఆంధ్రప్రదేశ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్నరామ సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని వాసవీధర్మశాలలో శనివారం జిల్లా ఆర్యవైశ్య నూతన కమిటీ ప్రమాణస్వీ కా రోత్సవానికి వారు ముఖ్య అతిథితులుగా హాజరయ్యారు.

దేశానికి దిక్సూచి ఆర్యవైశ్యులు
జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తున్న జేపీకే రాము

జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవంలో వక్తలు

హిందూపురం అర్బన, మార్చి 2: దేశానికి దశ, దిశ, దిక్సూచి ఆర్యవైఽశ్యులే అని ఆంధ్రప్రదేశ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్నరామ సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని వాసవీధర్మశాలలో శనివారం జిల్లా ఆర్యవైశ్య నూతన కమిటీ ప్రమాణస్వీ కా రోత్సవానికి వారు ముఖ్య అతిథితులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... ఆర్యవైశ్యులు పోరాట పటిమ ఉన్నవారని, అదైర్య వంతులు కారన్నారు. దేశంకు ఆదాయ వనరులు ఆర్యవైశ్యుల వల్లే అన్నారు. వ్యాపారాల వల్ల దేశానికి సగం ఆదాయం వర్తకుల నుంచే వస్తుందన్నారు. ఆర్యవైశ్యులకు 5 శాతం రిజర్వేషన కల్పించాలన్నారు. ముఖ్యంగా ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలన్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా జేపీకే రాము, ప్రఽధాన కార్యదర్శిగా రవీంధ్రుడు, కోశాధికారిగా శ్రీకాంత, వర్కింగ్‌ అధ్యక్షుడిగా ప్రకాష్‌ మరి కొంత మంది కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభివృద్దికి శక్తి వంచన లేకుండా పాటుపడుతామన్నారు. అంతకు ముందు ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ మాత ఆలయంలో నవగ్రహాల ఆలయానికి వెండి వాకిలి ఏర్పాటు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్యుల నాయకులు పోతుల సురేష్‌, కోటా సత్యం తదితరులు హాజరయ్యారు.

Updated Date - Mar 03 , 2024 | 12:11 AM