Share News

AP roads: ఈ రోడ్డుకు మోక్షమెప్పుడో...?

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:52 PM

నగరంలో అత్యంత ప్రధానమైన రహదారులలో పీటీసీ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి ముఖ్యమైనది. కేంద్రం ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.311.93 కోట్లు వెచ్చింది. 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఆయితే ఈ బ్రిడ్జికి ఒకవైపు (శాంతి థియేటర్‌, బెంగుళూర్‌ బేకరీ షాపు వైపు) సర్వీస్‌ రోడ్డు ఏళ్ల తరబడి నిర్మాణ పనులు చేయకపోవడంతో అవస్థల నడుమ వాహన చోదకులు, పాదచారులు రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది.

AP roads: ఈ రోడ్డుకు మోక్షమెప్పుడో...?
People moving in dust

అనంత నడిబొడ్డు టవర్‌క్లాక్‌ వద్ద దుస్థితి... రాకపోకలకు తీవ్ర అంతరాయం

అనంతపురం సిటీ, ఏప్రిల్‌ 24 : నగరంలో అత్యంత ప్రధానమైన రహదారులలో పీటీసీ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి ముఖ్యమైనది. కేంద్రం ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.311.93 కోట్లు వెచ్చింది. 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఆయితే ఈ బ్రిడ్జికి ఒకవైపు (శాంతి థియేటర్‌, బెంగుళూర్‌ బేకరీ షాపు వైపు) సర్వీస్‌ రోడ్డు ఏళ్ల తరబడి నిర్మాణ పనులు చేయకపోవడంతో అవస్థల నడుమ వాహన చోదకులు, పాదచారులు రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. ఎమ్మెల్యే, మేయర్‌ తదితర ప్రజాప్రతినిధులకు నిత్యం ఈ సమస్య కనిపిస్తున్నా పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు.


కొందరు ప్రైవేట్‌ స్థలాల వ్యక్తులు పనులు చేస్తుంటే.. ఆ రోడ్డుపైకి దుమ్ము లేస్తోంది. ఆయినప్పటికి ఏ ఒక్కరు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే మాత్రం.. బ్రిడ్జిని అన్ని హంగులతో పూర్తి చేశాం.. త్వరలోనే ఈ సర్వీస్‌ రోడ్డును పూర్తి చేస్తాం అని చెప్పడమే తప్ప చేసిందేమీ లేదని నగర వాసులు విమర్శిస్తున్నారు. వాహనచోదకులు, పాదచారుల, సర్వీస్‌ రోడ్డు వెంబడి ఉన్న దుకాణాల యజమానుల పరిస్థితి ఏమిటో ఈ చిత్రాలు చూస్తే తెలిసిపోతుంది. ఈ రోడ్డు అధ్వాన్న స్థితిలో ఉండటంలో ఏమాత్రం వ్యాపారాలు జరగడం లేదని వాపోతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Apr 24 , 2024 | 11:52 PM