Share News

నామినేషన్లకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:17 AM

కదిరి, ఏప్రిల్‌ 17: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లను దాఖలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అఽధికారి వంశీకృష్ణ బుధవారం తెలిపారు.

నామినేషన్లకు సర్వం సిద్ధం

కదిరి, ఏప్రిల్‌ 17: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లను దాఖలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అఽధికారి వంశీకృష్ణ బుధవారం తెలిపారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఈనెల 18నుంచి 25వ తేదీ వరకు కదిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నట్లు చెప్పారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. సెలవు రోజులు మినహాయించి మిగిలిన రోజుల్లో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. నామినేషన వేసే అభ్యర్థితోపాటు మరో నలుగురిని మాత్రమే నామినేషన హాల్లోకి అనుమతిస్తామన్నారు. కార్యాలయానికి రెండువైపులా వంద మీటర్ల దూరంలోనే అందరినీ ఆపేస్తామన్నారు. నామినేషన పత్రాల దాఖలుకు సంబంధించిన అన్ని వివరాలను ఇప్పటికే అభ్యర్థులకు హెల్ప్‌డెస్క్‌ అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి

ధర్మవరంరూరల్‌: ధర్మవరం నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదివరకే కార్యాలయానికి సామగ్రి చేరుకోవడంతో సిబ్బంది వాటిని సరిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. అభ్యర్థి వెంట ఎంతమంది వస్తారు.. వారికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు సి బ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల నామినేషన్ల కోలాహాలం ప్రారంభం కావడంతో ఏర్పాట్లను అధికారులు చకచకా చేస్తున్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:17 AM