అందరినీ కలుపుకుని ముందుకెళ్తా: అమిలినేని
ABN , Publish Date - Feb 27 , 2024 | 12:31 AM
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ, జన సేన నాయకులు, కార్యకర్తలను అందరినీ కలు పుకొని ముందుకు వెళతానని ఆ నియోజక వర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు.
![అందరినీ కలుపుకుని ముందుకెళ్తా: అమిలినేని](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అనంతపురం అర్బన, ఫిబ్రవరి 26: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ, జన సేన నాయకులు, కార్యకర్తలను అందరినీ కలు పుకొని ముందుకు వెళతానని ఆ నియోజక వర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. నగరంలోని రాంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన హాల్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు చంద్రబాబు, నారాలోకేశ, అచ్చెంనాయుడులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 29 నుంచి తాను కళ్యాణదుర్గంలోనే నివాసం ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న భావంతోనే క్రియాశీల రాజకీయా ల్లోకి వచ్చానన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిం చిన ఆరు నెలల్లో నియోజకవర్గంలోని సమస్య లన్నీ పరిష్కరిస్తామన్నారు. వైసీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, భూకబ్జాలపై విచారణ చేయించి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా చేస్తానన్నారు.