elections: 25న వ్యవసాయ శాఖ ఉద్యోగుల అసోసియేషన ఎన్నికలు
ABN , Publish Date - Aug 21 , 2024 | 12:19 AM
ఉమ్మడి జిల్లా వ్యవసాయ శాఖ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన ఎన్నికలు ఈనెల 25న నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయికుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం నగరంలోని రైతు బజార్ వద్ద ఉన్న కృషి భవనలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
అనంతపురం అర్బన, ఆగస్టు 20: ఉమ్మడి జిల్లా వ్యవసాయ శాఖ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన ఎన్నికలు ఈనెల 25న నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయికుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం నగరంలోని రైతు బజార్ వద్ద ఉన్న కృషి భవనలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కోశాధికారి శ్యాంసుందర్ శ్రీనివాస్, సహాయ ఎన్నికల అధికారిగా కృష్ణా జిల్లా అధ్యక్షుడు రమేష్, ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివా్సను నియమించినట్లు వెల్లడించారు. ఉమ్మడి అనంత జిల్లాలో పనిచేస్తున్న అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్ నుంచి క్లాస్ఫోర్ ఉద్యోగుల దాకా ప్రతిఒక్కరూ హాజరై ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.