Share News

ఎన్నికలొస్తేనే.. గుర్తొస్తొమా?ఏం చేశారని ఓట్లేయాలి?

ABN , Publish Date - May 08 , 2024 | 11:50 PM

‘ఎమ్యెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి గెలిచాక ఐదేళ్లలో ఒకసారి మాత్రమే మా తండాకు వచ్చారు తప్ప.. అభివృద్ధి చేసిందేమీ లేదు. మళ్లీ ఐదేళ్లకు మా ఊరొచ్చారు.

ఎన్నికలొస్తేనే.. గుర్తొస్తొమా?ఏం చేశారని ఓట్లేయాలి?

ఏ మొహం పెట్టుకుని ఓట్లడుగుతారు?

వైసీపీ నాయకులను నిలదీసిన తండా యువకులు

పుట్టపర్తి రూరల్‌, మే 8: ‘ఎమ్యెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి గెలిచాక ఐదేళ్లలో ఒకసారి మాత్రమే మా తండాకు వచ్చారు తప్ప.. అభివృద్ధి చేసిందేమీ లేదు. మళ్లీ ఐదేళ్లకు మా ఊరొచ్చారు. ఎన్నికలొస్తేనే గుర్తొస్తామా?’ అంటూ ప్రచారానికి వచ్చిన వైసీపీ నాయకులను జిల్లా కేంద్రం పరిధిలోని బ్రాహ్మణపల్లి తండా యువకులు నిలదీశారు. ఈ పరిణామంతో వైసీపీ నాయకులు అవాక్కయ్యారు. వైసీపీ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ నాయకుడు సాయిరాంరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం బ్రాహ్మణపల్లిలో ప్రచారం నిర్వహించారు. తమ తండాలో ప్రచారం చేయొద్దని కొంతమంది యువకులు అడ్డుకున్నారు. ‘తండాలో అభివృద్ధే చేయని మీకు ఓట్లేసే ప్రసక్తే లేద’ని తెగేసి చెప్పారు. దీంతో కంగుతిన్న వైసీపీ నాయకులు అక్కడి నుంచి జారుకున్నారు.

Updated Date - May 08 , 2024 | 11:50 PM