సెలవుల్లో తరగతులు నిర్వహించే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Jan 08 , 2024 | 12:24 AM
సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులను వేధిస్తూ తరగతులు నిర్వహించే విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎ్ఫఐ నాయకులు డిమాండ్ చేశారు.
![సెలవుల్లో తరగతులు నిర్వహించే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి](https://media.andhrajyothy.com/media/2023/20231205/7hdp55f_2ed599839b.jpg)
హిందూపురం అర్బన, జనవరి 7: సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులను వేధిస్తూ తరగతులు నిర్వహించే విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎ్ఫఐ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక బీసీ కళాశాల వసతి గృహంలో ఆదివారం ఎస్ఎ్ఫఐ నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తెలుగు వారికి మొదటి పండుగని, పండుగ రోజుల్లో కూడా కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు తరగతులను నిర్వహించాలని చూస్తున్నాయన్నారు. తరగతులు నిర్వహించే సంస్థలపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. అనంతరం ఎస్ఎ్ఫఐ పత్రికలు ప్రదర్శించారు. ఎస్ఎ్ఫఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి, నాయకులు చంద్రశేఖర్, హర్షకుమార్, నిహాల్, భరత, అభి, వినోద్, గురు, బాబాఫకృద్దీన, హేమంత పాల్గొన్నారు.