Share News

శ్రావణీశ్రీకి స్వగ్రామంలో ఘన స్వాగతం

ABN , Publish Date - Jun 06 , 2024 | 12:14 AM

బండారు శ్రావణీశ్రీకి తన సొంత గ్రామమైన సిద్దరాం పురంలో బుధవారం ఘన స్వాగతం లభించింది. ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కలిసి బుధవారం ఉదయం తన స్వగ్రామమైన సిద్దరాంపురం గ్రామానికి వెళ్లారు.

శ్రావణీశ్రీకి స్వగ్రామంలో ఘన స్వాగతం
సిద్దరాంపురంలో శ్రావణిశ్రీకి స్వాగతం పలుకుతున్న అభిమానులు

బుక్కరాయసముద్రం, జూన 4: బండారు శ్రావణీశ్రీకి తన సొంత గ్రామమైన సిద్దరాం పురంలో బుధవారం ఘన స్వాగతం లభించింది. ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కలిసి బుధవారం ఉదయం తన స్వగ్రామమైన సిద్దరాంపురం గ్రామానికి వెళ్లారు. తన తాత సమాధి వద్ద నివాళలర్పించారు. అనంతరం గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఆమె వెంట టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పసుపుల హనుమంతురెడ్డి, పసుపుల నారాయణరెడ్డి ఉన్నారు.


శింగనమల : శింగనమల కూటమి అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ విజయం సాధించడంతో నియోజకవర్గంలో టీడీపీ కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి అభినందలు తెలిపారు. బుధవారం అనంతపురంలోని బండారు శ్రావణిశ్రీ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి, మారుతి నాయడు, గుత్తాఆదినారాయణ, చిదనందనాయుడు, చితంబరిదొర, గుర్రం లక్ష్మినారాయణ, సత్తి నగముని బండి వెంకటనారాయణ, ఎర్రిస్వామి మాసూలచంద్ర అనీల్‌ రహితుల్లా తదితరులు ఆమెకు అభినందనలు తెలిపారు.

Updated Date - Jun 06 , 2024 | 12:14 AM