ఘనంగా పాఠశాల వార్షికోత్సవం
ABN , Publish Date - Mar 14 , 2024 | 11:56 PM
మండలంలోని పులమతి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎంఈఓ నాగరాజునాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
![ఘనంగా పాఠశాల వార్షికోత్సవం](https://media.andhrajyothy.com/media/2024/20240313/14lpk1_38a7160354.jpg)
లేపాక్షి, మార్చి 14 : మండలంలోని పులమతి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎంఈఓ నాగరాజునాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్తులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి మంచి విజయా లు సాధించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు సమయపాలనతో చదువుతూ మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలన్నారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన సైన్స ఫెయిర్ సందర్శకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.