Share News

ఘనంగా కనకదాస విగ్రహం ఊరేగింపు

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:24 AM

మండల కేంద్రంలో కురుబ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించనున్న కనకదాస కాస్య విగ్రహం ఊరేగింపును ఘనంగా నిర్వహించారు.

ఘనంగా కనకదాస విగ్రహం ఊరేగింపు
కనకదాస విగ్రహం ఊరేగింపులో పాల్గొన్న పరిటాల సునీత, బీకే పార్థసారథి

ఆత్మకూరు జనవరి 6: మండల కేంద్రంలో కురుబ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించనున్న కనకదాస కాస్య విగ్రహం ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి పరిటాల సునీత, సత్యసాయి జిల్లా అధ్యక్షుడు పార్థసారథి హాజరయ్యారు. కురుబలు బాణ సంచా కాల్చి వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో విగ్రహం ఊరేగింపు కార్యక్రమానకి కురుబలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చిన్నారులు, యువతులు జ్యోతులు పట్టుకుని ఊరేగింపులో ముందు నడిచారు. జిల్లా కురుబ సంఘం సభ్యులతో కలసి నడవడం ఎంతో ఆనందంగా ఉందని పరిటాల సునీత అన్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు. కురుబలకు పార్టీ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. టీడీపీ మండల ఇనచార్జి బాలాజీ, జిల్లా నాయకులు అనీల్‌ చౌదరి, మండల కన్వీనర్‌ శ్రీనివాసులు, టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు పరుశురామ్‌, సాధికార కమిటీ కన్వీనర్‌ గంగులకుంట రమణ, మాజీ ఎంపీపీ మాధవి, వైస్‌ ఎంపీపీ ప్రతాప్‌, వేణుగోపాల్‌, సుబ్బర హరి, కాంట్రాక్టర్‌ పోతులయ్య, పంపు కొండప్ప, నాగన్న, ప్రసాద్‌, చిరంజీవి, మల్లికార్జున, మారుతి, ఆదెప్ప, పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 12:24 AM