పెరుగునున్నపెట్రోల్, డీజిల్ ధరలు..!

ABN, First Publish Date - 2023-10-16T12:31:31+05:30 IST

ఇజ్రాయెల్, హమాస్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం కొనసాగుతోంది. దాదాపు పది రోజులుగా ఈ యుద్ధం ఇజ్రాయెల్‌కు తీవ్ర నష్టం చేకూర్చింది. ఇజ్రాయెల్, హమాస్ సేనల మధ్య భీకరంగా సాగుతున్న ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియడంలేదు.

ABN Digital: ఇజ్రాయెల్, హమాస్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం కొనసాగుతోంది. దాదాపు పది రోజులుగా ఈ యుద్ధం ఇజ్రాయెల్‌కు తీవ్ర నష్టం చేకూర్చింది. ఇజ్రాయెల్, హమాస్ సేనల మధ్య భీకరంగా సాగుతున్న ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియడంలేదు. దీంతో ఈ యుద్ధం ప్రభావం ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడింది. ముఖ్యంగా ఇండియాపై ఎక్కువగా పడింది. యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు పెరగడం ఇప్పుడు భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఈ యుద్ధం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఇటీవలే జీ-20 ముగింపు కార్యక్రమంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇప్పుడు ముడి చమురు వంద డాలర్లు దాటుతుందన్న భయం వెంటాడుతోంది. ఇదే జరిగితే ఇండియాలో పెట్రోల్, డీజీల్ ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-16T12:31:31+05:30