minister Harish Rao: ఏపీ మంత్రులపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఫైర్
ABN, First Publish Date - 2023-04-12T15:45:21+05:30 IST
ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు (Telangana minister Harish Rao) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు (Telangana minister Harish Rao) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రులపై (AP ministers) మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఆంధ్ర మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఏపీ మంత్రి తెలంగాణలో ఏం ఉందని ప్రశ్నించగా.. దీనిపై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ తెలంగాణ వచ్చి చూడాలని సూచించారు. 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉందని ఏపీ మంత్రికి హరీష్ రావు తెలిపారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పినా.. దానిపై అధికార పక్షం స్పందించని, ప్రతిపక్షం ప్రశ్నించని ఎద్దేవా చేశారు.
Updated at - 2023-04-12T15:45:21+05:30