మనసులను కదిలించిన శునకం కథ..
ABN, First Publish Date - 2023-08-02T12:36:21+05:30 IST
ఎన్టీఆర్ జిల్లా: ఈ సృష్టిలో జీవరాసులు ఎన్ని ఉన్నా.. తల్లి ప్రేమ మాత్రం ఒక్కటే.. అలాంటి మాతృ ప్రేమకు ఓ శునకం సాక్ష్యంలో నిలిచింది. ప్రమాదంలో ఉన్న తన పిల్లలను కాపాడాలని మనుషులను మూగగా వేడుకోవడం.. సహాయక బృందాల చుట్టూ తిరిగిన దృశ్యాలు..
ఎన్టీఆర్ జిల్లా: ఈ సృష్టిలో జీవరాసులు ఎన్ని ఉన్నా.. తల్లి ప్రేమ మాత్రం ఒక్కటే.. అలాంటి మాతృ ప్రేమకు ఓ శునకం సాక్ష్యంలో నిలిచింది. ప్రమాదంలో ఉన్న తన పిల్లలను కాపాడాలని మనుషులను మూగగా వేడుకోవడం.. సహాయక బృందాల చుట్టూ తిరిగిన దృశ్యాలు మనసులను కదిలిస్తున్నాయి. తాజాగా కురిసిన భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. ఆ వరదల్లో మనుషులతోపాటు మూగ జీవాలు కూడా ప్రాణాలు విడిచాయి. ఈ క్రమంలో వరదల్లో చిక్కుకున్న తన పిల్లల కోసం ఓ శునకం చేసిన ప్రయత్నం ఆశ్చర్యపరుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా, నందిగామలో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-02T12:59:43+05:30