జంప్ చేస్తున్న ఉద్యోగులు.. సర్వేలో షాకింగ్ నిజాలు..

ABN, First Publish Date - 2023-05-22T14:36:44+05:30 IST

రిస్క్ చేయకపోతే మిగిలేది రస్కేనని ఉద్యోగులు అంటున్నారు. ఒకప్పుడు ఒకే సంస్థలో ఏళ్ల తరబడి కొలువు చేసే ఉద్యోగులు ఇప్పుడు అంత ఓపికను ప్రదర్శిచండంలేదు.

ABN Internet Desk: ఒకప్పుడు ఒకే సంస్థలో ఏళ్ల తరబడి కొలువు చేసే ఉద్యోగులు ఇప్పుడు అంత ఓపికను ప్రదర్శిచండంలేదు. రిష్క్ అయినా పర్లేదుకానీ.. తమ అనుభవానికి తగ్గ వేతనం, గౌరవం లభించకపోతే ఆ సంస్థకు గుడ్ బై చెప్పేస్తున్నారట.. ఇది ఊరికే చెబుతున్న మాటలు కాదు. ప్రపంచ రిక్రూట్‌మెంట్ సంస్థ మైకేల్ పేజ్ ఇండియా వార్షిక టాలెంట్ ట్రండ్స్ 2023 సర్వేలో భాగంగా కనిపించని విప్లవం పేరిట ప్రచురించిన వేదికలో వెల్లడించిన విషయాలు. ఈ మధ్య కాలంలో ఉద్యోగుల్లో రిస్క్ సామర్ధ్యం విశేషంగా పెరిగిందని ఆ నివేదికలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా 70వేల మందిని, భారత్‌లో 4వేల మందిని ఈ సర్వేలో భాగంగా ప్రశ్నించారు. పనిచేస్తున్న కంపెనీలకు విశ్వాసంగా ఉండే వైఖరి వదిలివేసి మెరుగైన వేతనం, పనిలో సౌలభ్యం లభించినట్టయితే ఎంత రిస్క్ అయినా తీసుకుని కొత్త ఉద్యోగాలు చేపట్టినట్లు సిద్ధమవుతున్నట్లు ఉద్యోగులు వెల్లడించారు. 98 శాతం మంది నిపుణులైన ఉద్యోగులు కొత్త అవకాశాలు అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపింది.

Updated at - 2023-05-23T00:01:46+05:30