గణేష్ విగ్రహాల నిమజ్జనాలపై హైకోర్టు కీలక ఆదేశాలు..

ABN, First Publish Date - 2023-09-26T12:42:52+05:30 IST

హైదరాబాద్: అంగరంగ వైభవంగా సాగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లో కొన్ని చోట్ల ఇప్పటికే వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్: అంగరంగ వైభవంగా సాగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లో కొన్ని చోట్ల ఇప్పటికే వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనాలపై హైకోర్టు కీలక ఆదేశాలు వెల్లడించింది. గణేష్ విగ్రహాల నిమజ్జనంపై న్యాయస్థానం ఆంక్షలు విధిస్తూ.. హుస్సేన్ సాగర్‌తోపాటు ఇతర చెరువుల్లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులను యధాతథంగా అమలు చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-26T12:42:52+05:30