తమిళనాడు: యూట్యూబ్ చూస్తూ భార్యకు డెలివరీ

ABN, First Publish Date - 2023-08-25T12:06:06+05:30 IST

తమిళనాడు: ఓ భర్త తన భార్యపట్ల తీసుకున్న నిర్ణయం ఆమె నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాద ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో జరిగింది. పోచంపల్లిలోని పులియాంపట్టి గ్రామానికి చెందిన లోకనాయకికి ధర్మపురి జిల్లాకు చెందిన మాదేశ్‌తో వివాహం జరిగింది.

తమిళనాడు: ఓ భర్త తన భార్యపట్ల తీసుకున్న నిర్ణయం ఆమె నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాద ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో జరిగింది. పోచంపల్లిలోని పులియాంపట్టి గ్రామానికి చెందిన లోకనాయకికి ధర్మపురి జిల్లాకు చెందిన మాదేశ్‌తో వివాహం జరిగింది. వారు సహజమైన పద్ధతిలో జీవించాలని ఇంటి ఆవరణలో సేంద్రీయ విధానంలో ఆకుకూరలు, కూరగాయలు పండిస్తూ.. అవే తింటూ జీవనం సాగిస్తున్నారు. భార్య లోకనాయకి గర్భవతి కావడంతో ఆమె సహజ పద్ధతిలో ప్రసవించాలని మదేశ్ తెలిసీ తెలియని పనిచేశాడు. యూట్యూబ్‌లో నార్మల్ డెలివరి చూస్తూ భార్యకు పురుడు పోయాలనుకున్నాడు. ఆ ప్రయోగం వికటించడంతో అధిక రక్తస్త్రావమై చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-25T12:06:06+05:30