కాలుష్య నివారణకు ఢిల్లీ సర్కార్ ప్రయోగం..

ABN, First Publish Date - 2023-11-10T12:02:35+05:30 IST

న్యూఢిల్లీ: కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని ఢిల్లీ ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కరి అవుతోంది. ప్రమాదకరస్థతిలో కాలుష్యం పెరిగిపోవడంతో నియంత్రించేందుకు ప్రభుత్వం కొత్త మార్గాలను వెతుకుతోంది.

న్యూఢిల్లీ: కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని ఢిల్లీ ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కరి అవుతోంది. ప్రమాదకరస్థతిలో కాలుష్యం పెరిగిపోవడంతో నియంత్రించేందుకు ప్రభుత్వం కొత్త మార్గాలను వెతుకుతోంది. డిసెంబర్‌లో ఇవ్వాల్సిన శీతాకాలం సెలవులను నవంబర్‌లోనే ఇచ్చింది. వాహనాల సరి.. బేసీ విధానంలో అనుమతించాలని నిర్ణయించింది. అలాగే కృత్రిమ వర్షం కురిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కాన్పూర్ ఐఐటీ నిపుణులతో ఢిల్లీ సర్కార్ సంప్రదింపులు జరిపింది. ఈ నెల 20, 21వ తేదీల్లో కృత్రిమ వర్షం కురిపించేందుకు అణువైన వాతావరణం ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-10T12:02:37+05:30