ఏపీ ప్రజలపై మరో రూ.2 వేల కోట్ల రుణభారం
ABN, First Publish Date - 2023-01-10T22:56:10+05:30 IST
ఏపీ ప్రభుత్వానికి మరో రూ. 2 వేల కోట్లు అప్పు దొరికింది. అయినా వేతనాలు, పెన్షన్లు జమఅయ్యే అవకాశం లేదు. దాదాపుగా 11 వందల కోట్ల రూపాయల వరకు వేతనాలు, పెన్షన్లు ఇంకా చెల్లించాల్సి ఉంది.
ఏపీ ప్రభుత్వానికి మరో రూ. 2 వేల కోట్లు అప్పు దొరికింది. అయినా వేతనాలు, పెన్షన్లు జమఅయ్యే అవకాశం లేదు. దాదాపుగా 11 వందల కోట్ల రూపాయల వరకు వేతనాలు, పెన్షన్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. రిజర్వ్ బ్యాంకు వద్ద సెక్యూరిటీ బాండ్ల ద్వారా మంగళవారం తీసుకొచ్చిన అప్పు రూ. 2 వేల కోట్లు రిజర్వ్ బ్యాంకు ఓడీ కింద జమ చేసుకుంది. ఇ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు రెగ్యులర్ ఆదాయం నుంచి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Updated at - 2023-01-10T22:57:43+05:30