లంచం వ్యవహారంలో వైసీపీ మంత్రి ప్రమేయం..!
ABN, First Publish Date - 2023-11-10T10:47:51+05:30 IST
బాపట్ల జిల్లా: పోలీసులతో మంత్రి మేరుగ నాగార్జున లంచాలు వసూలు చేయడం కలకలంరేగింది. చుండూరులోని కేయఎన్పల్లిలో ఇద్దరి మధ్య స్థల వివాదం చోటు చేసుకుంది. దీనిపై బత్తుల గోవింద్ అనే వ్యక్తిపై చుండూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
బాపట్ల జిల్లా: పోలీసులతో మంత్రి మేరుగ నాగార్జున లంచాలు వసూలు చేయడం కలకలంరేగింది. చుండూరులోని కేయఎన్పల్లిలో ఇద్దరి మధ్య స్థల వివాదం చోటు చేసుకుంది. దీనిపై బత్తుల గోవింద్ అనే వ్యక్తిపై చుండూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసులో అరెస్టు చేయకుండా ఉండేందుకు పోలీసులు పెద్ద మొత్తంలో లంఛం డిమాండ్ చేయగా చివరికి రూ. 2లక్షల 45వేలకు ఒప్పందం కుదిరింది. ముందుగా రూ. 2 లక్షలు ఇవ్వగా మిగతా రూ. 45వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు. ఎస్ఐ భరత్తోపాటు, కానిస్టేబుల్ క్రాంతి, రైటర్ రవీంధ్రలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో మేరుగ నాగార్జున వ్యవహారం ఉండడంతో ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-10T10:47:53+05:30