YS Vivekananda Reddy murder case: దస్తగిరి సంచలన వ్యాఖ్యలు..
ABN, First Publish Date - 2023-02-06T08:30:21+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు(Ex-minister YS Vivekananda Reddy murder case) విచారణలో అప్రూవర్గా
కడప:మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు(Ex-minister YS Vivekananda Reddy murder case) విచారణలో అప్రూవర్గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ (cm jagan) సహకరించి ఉంటే పది రోజుల్లోనే ఈ కేసు తేలిపోయేదన్నారు. ఆయన సహకరించకపోవడం వల్లే కేసును హైదరాబాద్కు బదిలీ చేశారని, నిజాలేంటో త్వరలోనే వెల్లడవుతాయన్నారు. ఈ నెల 10న విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ కోర్టు(CBI Court) ఆదేశించిన నేపథ్యంలో దస్తగిరి(Dastagiri) ఆదివారం కడప సెంట్రల్ జైలు(Kadapa Central Jail) వద్ద ఉన్న సీబీఐ అతిథిగృహానికి వచ్చి నోటీసులు(Notices) తీసుకున్నారు.
Updated at - 2023-02-06T16:42:08+05:30