Vivekananda Reddy murder case: కీలక దశకు వివేకా హత్య కేసు

ABN, First Publish Date - 2023-01-31T12:20:38+05:30 IST

వివేకానంద రెడ్డి హత్య కేసు(Vivekananda Reddy murder case)లో సీబీఐ అధికారులకు ఒక ‘తీగ’ దొరికింది. అది...

అమరావతి: వివేకానంద రెడ్డి హత్య కేసు(Vivekananda Reddy murder case)లో సీబీఐ అధికారులకు ఒక ‘తీగ’ దొరికింది. అది... తాడేపల్లికి ‘కనెక్ట్‌’ అయినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. జగన్‌ బంధువు, మొదటి నుంచీ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డిని ప్రశ్నించినప్పుడు ఈ గుట్టు రట్టయింది. ఈ తీగ ఆధారంగా డొంకను కదిలిస్తే... వివేకా హత్య కేసు కీలక దశకు చేరుకోవడం ఖాయమని చెప్పొచ్చు. శనివారం సీబీఐ అధికారులు అవినాశ్‌ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 2019 మార్చి 15వ తేదీన పులివెందులలోని తన సొంత ఇంట్లో వివేకా దారుణ హత్యకు గురయ్యారు. ఆ రోజు ఏం జరిగింది, రక్తపు మరకలు ఎందుకు చెరిపారు, గుండెపోటు కథ ఎందుకు అల్లారు... ఇలాంటి అనేక అంశాలపై అవినాశ్‌ రెడ్డిని సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం.

Updated at - 2023-01-31T12:20:41+05:30