టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై నేడు హైకోర్టులో విచారణ
ABN, First Publish Date - 2023-09-06T12:03:50+05:30 IST
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యులుగా అనర్హులను నియమించారని దాకలైన పిటిషన్ను బుధవారం హైకోర్టు విచారించనుంది. బోర్డు సభ్యులుగా కేతన్ దేశాయ్, సామినేని ఉదయభాను, శరత్ చంద్రారెడ్డి నియమకాలను సవాల్ చేస్తూ జైభీమ్ యాక్సెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది.
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యులుగా అనర్హులను నియమించారని దాకలైన పిటిషన్ను బుధవారం హైకోర్టు విచారించనుంది. బోర్డు సభ్యులుగా కేతన్ దేశాయ్, సామినేని ఉదయభాను, శరత్ చంద్రారెడ్డి నియమకాలను సవాల్ చేస్తూ జైభీమ్ యాక్సెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. పలు కేసులు ఉన్న వ్యక్తులను టీటీడీ బోర్డులో నియమించడం నిబంధనలకు విరుద్ధమని ఆ పిటిషన్లో పేర్కొంది. ఆ ముగ్గురికి నేర చరిత్ర ఉందని, వారిని బోర్డులో సభ్యులుగా నియమించేందుకు వీలు లేదని పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది. పిటీషన్ తరఫున హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-06T12:03:50+05:30