Guntur Dist.: పొన్నూరులో ఉద్రిక్తత..

ABN, First Publish Date - 2023-05-30T12:40:26+05:30 IST

గుంటూరు జిల్లా: పొన్నూరులో ఉద్రిక్తత నెలకొంది. రైల్వే స్టేషన్ (Railway Station) సమీపంలో మూడో లైన్ విస్తరణలో భాగంగా అధికారులు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు.

గుంటూరు జిల్లా: పొన్నూరులో ఉద్రిక్తత నెలకొంది. రైల్వే స్టేషన్ (Railway Station) సమీపంలో మూడో లైన్ విస్తరణలో భాగంగా అధికారులు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. రైల్వే స్థలాల్లో అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లను తొలగిస్తున్నారు. అధికారుల చర్యలతో బాధితులు ఆందోళనకు దిగారు. గృహాలను తొలగిస్తే తాము ఎక్కడికి వెళ్లాలంటూ రోడ్‌పై బైఠాయించారు. గతంలో ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చినా.. ఇళ్లను ఖాళీ చేయకపోవడంతోనే తొలగించాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-05-30T12:40:26+05:30