అమరావతిలో ఉద్రిక్తత... రైతుల నిరసన

ABN, First Publish Date - 2023-07-24T12:11:17+05:30 IST

అమరావతి: కృష్ణాయపాలెంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అమరావతి రైతులు నిరసనలు తెలుపుతున్నారు. శిబిరాల్లో నల్ల బెలూన్లు, జెండాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అమరావతి: కృష్ణాయపాలెంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అమరావతి రైతులు నిరసనలు తెలుపుతున్నారు. శిబిరాల్లో నల్ల బెలూన్లు, జెండాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రాకను నిరసిస్తూ సోమవారం ఉదయం నుంచే రైతులు నిరసనకు దిగారు. మరోవైపు ముఖ్యమంత్రి కార్యక్రమానికి భారీగా ప్రజలను బస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్ధులకు పరీక్షలు ఉన్నాయని, బస్సులు ఇవ్వలేమని కళాశాల యాజమాన్యాలు చెప్పినా.. బస్సులు ఇవ్వాల్సిందేనని అధికారులు ఒత్తిడి చేశారు. స్కూళ్లు, కాలేజీ బస్సులు తీసుకుని జనాన్ని తరలిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-24T12:11:17+05:30