ఏపీలో స్మార్ట్ మీటర్లుతో స్మార్ట్‌గా దోపిడీ..

ABN, First Publish Date - 2023-06-07T12:15:53+05:30 IST

అమరావతి: ఏపీలో స్మార్ట్ మీటర్లతో స్మార్ట్ గా దోపిడీ జరుగుతోందని, స్మార్ట్‌మీటర్లు, మోటార్ల స్కామ్‌పై సీబీఐ విచారించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

అమరావతి: ఏపీలో స్మార్ట్ మీటర్లతో స్మార్ట్ గా దోపిడీ జరుగుతోందని, స్మార్ట్‌మీటర్లు, మోటార్ల స్కామ్‌పై సీబీఐ విచారించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) డిమాండ్ చేశారు. ఏపీలో రూ.17 వేల కోట్ల స్కామ్‌పై సమగ్ర విచారణ జరగాలన్నారు. మోటార్ల కంటే మీటర్ల రేటు రెండింతలు ఎలా ఎక్కువ?.. దీనిపై ప్రజలకు సీఎం జగన్‌ (CM Jagan) సమాధానం చెప్పాలన్నారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ద్వారా భారీ దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. బందిపోటు దొంగలను తలపించేలా జగన్‌ పాలన ఉందని సోమిరెడ్డి తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-06-07T12:15:53+05:30