జగన్ ప్రభుత్వంపై పురందేశ్వరి కామెంట్స్..

ABN, Publish Date - Dec 27 , 2023 | 11:28 AM

రాజమండ్రి: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు జగన్ ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. ఓ ఫోటో వాట్సాప్‌లో వైరల్ అయిందని, ఏపీలో రోడ్లు గుంతలమయంగా ఉన్న ఫోటో అది.

రాజమండ్రి: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. జగన్ ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. ఓ ఫోటో వాట్సాప్‌లో వైరల్ అయిందని, ఏపీలో రోడ్లు గుంతలమయంగా ఉన్న ఫోటో అది. ప్రజలు వాట్సాప్‌లో పెట్టి ఇది చంద్రమండలం నుంచి చంద్రయాన్ పంపిందని ప్రజలు పోస్టు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే గోదావరి జలాల పరిరక్షణ, టిడ్కో ఇళ్లు ఇవ్వలేదని, ఏ వర్గానికి న్యాయం చేయలేదని ఆమె మండిపడ్డారు. ఇసుక మాఫియా.. అవినీతిలో కూరుకుపోయి.. ప్రజావేతిక కూల్చివేతతో ఈ ప్రభుత్వం ప్రారంభమైందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో అంతా విధ్వంసమేనని పురంధేశ్వరి విమర్శించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Dec 27 , 2023 | 11:28 AM