జగన్ పాలన చూసి సిగ్గుపడుతున్నా..: పీకే
ABN, First Publish Date - 2023-10-30T11:46:08+05:30 IST
అన్ని రాష్ట్రాలు ఏపీని చూసి బుద్ధి తెచ్చుకోవాలంటూ జగన్ సలహాదారు ప్రశాంత్ కిషోర్ మాట మార్చారు. జగన్లా పారిపాలన చేస్తే అడుక్కు తినాల్సిందేనంటూ సూటిగా సుత్తి లేకుండా స్పష్టంగా చెప్పారు. అభివృద్ధి చేయకుండా, డబ్బు సంపాదించకుండా పంచుకుంటూ పోతే ఏపీ లాంటి పరిస్థితులే వస్తాయని పీకే అన్నారు
న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాలు ఏపీని చూసి బుద్ధి తెచ్చుకోవాలంటూ జగన్ సలహాదారు ప్రశాంత్ కిషోర్ మాట మార్చారు. జగన్లా పారిపాలన చేస్తే అడుక్కు తినాల్సిందేనంటూ సూటిగా సుత్తి లేకుండా స్పష్టంగా చెప్పారు. అభివృద్ధి చేయకుండా, డబ్బు సంపాదించకుండా పంచుకుంటూ పోతే ఏపీ లాంటి పరిస్థితులే వస్తాయని పీకే అన్నారు. ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు జగన్కు చెంపదెబ్బలాంటిదని చెప్పవచ్చు. జగన్ పాలన చూసి సిగ్గుపడుతున్నట్లు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవతార్ లైవ్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన షార్ప్ ఇన్సైడ్ అండ్ ఇండియా 2024 కార్యక్రమం కోసం ఓ జర్నలిస్టు ప్రశాంత్ కిషోర్ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఏపీలోని పరిస్థితులను ప్రస్తావించినప్పుడు ప్రశాంత్ కిషర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-30T11:46:08+05:30