MLA Raghunandan Rao: నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించినట్లు ఉంది..

ABN, First Publish Date - 2023-02-06T08:38:26+05:30 IST

రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది తమ కుటుంబసభ్యులే అంటూ మంత్రి కేటీఆర్‌(Minister KTR)

హైదరాబాద్: రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది తమ కుటుంబసభ్యులే అంటూ మంత్రి కేటీఆర్‌(Minister KTR) చేసిన ప్రకటనపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు(BJP MLA Raghunandan Rao)..నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించినట్లు ఉందన్నారు.‘‘నాలుగు కోట్ల మంది ప్రజలు మీ కుటుంబమైతే.. శ్రీకాంతచారి కుటుంబం ఎక్కడుంది..? రాష్ట్ర సాధనలో అమరులైన 1,200 మంది మీ కుటుంబం కాదా..? కానిస్టేబుల్‌ కిష్టయ్య, డీఎస్పీ నళిని మీ కుటుంబం కాదా? ఇతర పార్టీల నుంచి, విదేశాల్లో ఉంటున్న వారిని తీసుకువచ్చి ఎమ్మెల్సీలు, రాజ్యసభ సీట్లు ఇచ్చిన మీకు.. శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ ఎందుకు కుటుంబసభ్యురాలు కాలేకపోయింది. ఎమ్మెల్సీ కావాల్సింది కవిత(MLC KAVITHA) కాదు.. తెలంగాణ కోసం ఉద్యోగాన్ని త్యాగం చేసిన డీఎస్పీ నళిని. ఇదీ తెలంగాణ సమాజం కోరుకుంటోంది’’ అని అన్నారు.

Updated at - 2023-02-07T01:16:31+05:30