సీబీఐ తీరుపై పలు అనుమానాలున్నాయి..
ABN, First Publish Date - 2023-05-22T13:02:51+05:30 IST
హైదరాబాద్: ఎంపీ అవినాష్ కోసం కర్నూలు విశ్వభారతి ఆస్పత్రికి వెళ్లిన సీబీఐ అధికారులు భద్రత కోసం జిల్లా ఎస్పీని బతిమిలాడటం ఏమిటని టీడీపీ సీనియర్ నేత పట్టాభిరామ్ ప్రశ్నించారు.
హైదరాబాద్: ఎంపీ అవినాష్ కోసం కర్నూలు విశ్వభారతి ఆస్పత్రికి వెళ్లిన సీబీఐ అధికారులు భద్రత కోసం జిల్లా ఎస్పీని బతిమిలాడటం ఏమిటని టీడీపీ సీనియర్ నేత పట్టాభిరామ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ సీబీఐ వ్యవహరిస్తున్న తీరుపై పలు అనుమానాలున్నాయన్నారు. అధికారులు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. గతంలో తనకు స్కానింగ్ తీయకుండా ‘ఆల్ ఈజ్ వెల్’ అని రాసిచ్చేశారని, తనకు రాజమండ్రి సెంట్రల్ జైలులో 10 రోజులు చికిత్స చేశారని చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్లో ఎన్నో ఆస్పత్రులుంటే... అవినాష్ కర్నూలులో ఎందుకు ఆగారని ప్రశ్నించారు. వైద్యుల హెల్త్ బులెటిన్ కూడా నమ్మశక్యంగా లేదని పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-05-22T13:02:51+05:30