Kurnool District: వలస బాట పట్టిన ప్రజలు

ABN, First Publish Date - 2023-01-23T10:59:05+05:30 IST

జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి. భారీ వర్షాలు, నాసిరకం విత్తనాలు, తెగుళ్లు అన్నదాతలను నిలువునా

కర్నూలు: జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి. భారీ వర్షాలు, నాసిరకం విత్తనాలు, తెగుళ్లు అన్నదాతలను నిలువునా ముంచేశాయి. కర్నూలు జిల్లాలో ప్రధానమైన పత్తి పంట ఈ ఏడాది దాదాపుగా దెబ్బతింది. మిర్చి పంట కూడా చేతికి రాలేదు. దీంతో అన్నదాతలు పూర్తిగా నష్టపోయారు. సాగు పెట్టుబడికి చేసిన అప్పులే మిగిలాయి. దీనికితోడు ఊళ్లలో పనుల్లేక రైతన్నల బతుకు భారమైంది. మట్టిని నమ్ముకున్న రైతులు.. ఆ రైతులను నమ్ముకున్న వ్యవసాయ కూలీలు మూటాముల్లె సర్దుకుని, పిల్లాజెల్లాతో గుంటూరు, బెంగళూరు ప్రాంతాలకు వలస పోతున్నారు. ప్రతి రోజూ వలస దృశ్యాలు కనిపిస్తున్నాయి.

Updated at - 2023-01-24T16:58:41+05:30