Karnataka: చెన్నపట్టణంలో కుమారస్వామి వెనుకంజ

ABN, First Publish Date - 2023-05-13T10:29:41+05:30 IST

జేడీఎస్‌ (JDS)కు కర్నాటక ఓటర్లు షాక్‌ (Karnataka Voters Shocked) ఇచ్చారు. చెన్నపట్టణంలో కుమారస్వామి వెనుకంజలో ఉన్నారు. ఆయన కుమారుడు నిఖిల్ కూడా వెనుకంజలో ఉన్నారు.

బెంగళూరు: జేడీఎస్‌ (JDS)కు కర్నాటక ఓటర్లు షాక్‌ (Karnataka Voters Shocked) ఇచ్చారు. చెన్నపట్టణంలో కుమారస్వామి (Kumaraswamy) వెనుకంజలో ఉన్నారు. ఆయన కుమారుడు నిఖిల్ (Nikhil) కూడా వెనుకంజలో ఉన్నారు. కర్నాటక ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) చెప్పిన ప్రకారం ఫలితాలు వస్తున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ (Congress) తనకు కావాల్సి మాజిక్ ఫిగర్ దాటి ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాగా కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్‌ ప్రభావం చూపలేదని చెప్పవచ్చు.

ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నిన్న రాత్రి సింగపూర్ నుంచి బెంగళూరు చేరుకున్న కుమారస్వామి ఫలితాల ట్రెండ్‌పై స్పందించారు. ఇప్పటివరకు తమను ఏ పార్టీ సంప్రదించలేదని చెప్పారు. తమది చిన్నపార్టీ అని.. ప్రస్తుతానికి తనకు ఎలాంటి డిమాండ్లు లేవని ఆయన వ్యాఖ్యానించారు.

Updated at - 2023-05-13T10:29:41+05:30