కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు

ABN, First Publish Date - 2023-09-14T10:33:44+05:30 IST

హైదరాబాద్: నిరుద్యోగులను దగా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం ధర్నాచౌక్ వద్ద బీజేపీ 24 గంటల నిరాహారదీక్ష కార్యక్రమాన్ని చేపట్టింది. కిషన్ రెడ్డి చేపట్టిన దీక్షకు తెలంగాణ బీజేపీ అగ్రనేతలంతా హాజరై సంఘీభావం ప్రకటించారు.

హైదరాబాద్: నిరుద్యోగులను దగా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం ధర్నాచౌక్ వద్ద బీజేపీ 24 గంటల నిరాహారదీక్ష కార్యక్రమాన్ని చేపట్టింది. కిషన్ రెడ్డి చేపట్టిన దీక్షకు తెలంగాణ బీజేపీ అగ్రనేతలంతా హాజరై సంఘీభావం ప్రకటించారు. దీంతో బీజేపీ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు బుధవారం సాయంత్రం ప్రయత్నించారు. సభకు 6 గంటలవరకే అనుమతి ఉందని చెప్పి అదుపులోకి తీసుకుని బీజేపీ కార్యాలయానికి తరలించడానికి సిద్ధమయ్యారు. దీంతో వందలాదిమంది కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. కిషన్ రెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకోవడంతో పోలీసుల వాహనానికి బీజేపీ కార్యకర్తలు అడ్డంగా కూర్చొని నిరసనకు దిగారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-14T10:34:52+05:30