కవిత వర్సెస్ బండి సంజయ్..
ABN, First Publish Date - 2023-09-15T10:26:11+05:30 IST
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజా నోటీసులపై స్పందించిన బీర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ మోదీ రాజకీయ కక్షతో పంపించారంటూ ఆరోపించారు.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజా నోటీసులపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ మోదీ రాజకీయ కక్షతో పంపించారంటూ ఆరోపించారు. ఏడాది కాలంగా టీవీ సీరియల్స్లా సాగదీస్తున్నారని ఆరోపించారు. రాజకీయ దురుద్దేశాలతోనే ఈడీ నోటీసులు పంపిందని కవిత స్పష్టం చేశారు. అయితే కవితకు ఈడీ నోటీసులు ఇస్తే బీజేపీకి ఏం సంబంధమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు. అయినా కవితకు నోటీసులు ఇస్తే.. ఎందుకిచ్చారని అంటున్నవారే.. ఇవ్వకపోతే ఎందుకు అరెస్టు చేయడంలేదని ప్రశ్నిస్తున్నారని సంజయ్ అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-16T19:49:16+05:30